Monday, June 2, 2025

బిఆర్‌ఎస్ నుంచే విలీన ప్రయత్నాలు

- Advertisement -
- Advertisement -

కవిత అరెస్టు కాకుండా
చూడడానికి బిఆర్‌ఎస్
నేతలు ప్రయత్నించారు
కల్వకుంట్ల కుటుంబంలో
చార్‌పత్తా సినిమా షురూ
ఆపరేషన్ సిందూర్‌పై
సిఎం వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశద్రోహమే
కేంద్రమంత్రి
బండి సంజయ్

మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కల్వకుంట్ల ఆర్ట్ పతాకంపై కాంగ్రెస్ దర్శకత్వం లో కల్వకుంట్ల కవిత ప్రధాన పా త్రధారిగా ‘చార్ పత్తా’ సినిమా ను నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కవిత అరెస్టు కాకుండా చూడ డం కోసం బిఆర్‌ఎస్ పార్టీ నేతలే బిజెపిలో విలీనం కోసం ప్రయత్నించారు. అయితే వారిని మా దగ్గరి కూడా రానివ్వలేదు అని బండిసంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా, చొప్పదండి నియోజవర్గం, కరీంనగర్‌లో ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ..బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నడిపే సినిమాలో కెసిఆర్‌ను జోకర్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. కవిత ఎపిసోడ్‌తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? అని మీడియా కూడా ఆలోచించాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి మేలు కలిగించని ఇలాంటి డ్రామాలతో సాధించేదేమీ లేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండటంతో వాళ్ల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014లో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పి) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది..
‘తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని, యాసంగి వడ్లకు సంబంధించి రైతులు ఎన్ని బాధలు పడ్డరో కళ్లారా చూసినం’ అని అన్నారు. వానలతో పండించిన పంట కొను గోలు కేంద్రాల్లో తడిసిపోతుంటే కనీసం టార్పాలిన్లు కూడా ఇయ్యకుండా రైతులను వేధించారని ఆవేదన వ్యకం చేశారు. ‘తాలు, తడిసిన వడ్లని సాకు చూపుతూ క్వింటాలుకు పది కిలోలదాకా కటింగ్ చేసి రైతులను దోచుకున్నరు. ఇగ బోనస్ పైసలిస్తమన్నరు. ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదదు. అసలు వడ్ల కొనుగోలు పైసలే ఇంతవరకు రాలేదని రైతులంతా మొత్తుకుంటున్నరు’ అని అన్నారు. రైతుల విషయంలో కెసిఆర్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై చర్చ జరుగుతుంటే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నరు. కాళేశ్వ రం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫాంహౌస్, ఫార్ములా ఈ రేసు కేసుల విషయంలో కెసిఆర్, కెటిఆర్‌లను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పో యిందన్నారు. ఢిల్లీకి పోయి మూటలు అప్పగించడం తప్ప కాంగ్రెసోళ్లతో ఏదీ చేతగాదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.

గోవులు చనిపోవడంపై అధికారుల తీరు సరిగాలేదు..
వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో 18 గోవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. గోవులను కూడా రక్షించకపోతే ఎట్లా? సరైన సౌకర్యాలు కల్పిం చి వాటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై లేదా? అట్లాగే గోవుల సంఖ్యకు తగినట్లుగా తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకునేలా ఆలయ ఇఒతో మాట్లాడతా అన్నారు. అట్లాగే రాజన్న ఆలయంలో భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆదాయం కూడా పెరుగుతున్నందున భ క్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలే తప్ప భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

రేవంత్ రెడ్డివి దేశద్రోహ వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు..భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. సిఎం వ్యాఖ్యలు పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచిపోషించేలా ఉన్నాయని అని అన్నారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు భేటీ అయ్యారనే విషయం తనకు తెలియదని, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News