బెంగళూరు: బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసి అనంతరం వీడియో తీసి ఆమెను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బెళగావిలో ప్రాంతంలో ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దుశ్చర్యను తమ ఫోన్లలలో నిందితులు రికార్డు చేశారు. ఈ విషయం బయటకు చెబితే ఆన్లైన్లో పెడతామని బెదిరించారు. వీడియోల సహాయంతో బాలికను బ్లాక్మెయిల్ మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
బాలికను కొండల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్… వీడియో తీసి
- Advertisement -
- Advertisement -
- Advertisement -