వెల్లుల్లి అందరి వంటింట్లో ఉంటుంది. దీనిని వంటలో వాడుతారు. వెల్లుల్లి లేనిదే వంట పూర్తి చేయలేము. చేసుకునే వంటకు మంచి రుచి, వాసన ఇస్తుంది వెల్లుల్లి. అంతేకాకుండా దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో వెల్లుల్లిని బాగా వాడేవారు. ప్రధానంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెళ్లిన నీరు తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగానే ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతాయి. చర్మాని మెరిసేలా చేస్తుంది. శరీరంపై వచ్చే ముడతలు వృద్ధాప్య ఛాయాలు తక్కువగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లి తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు వెల్లుల్లి నీరును తీసుకుంటే చాలా మంచిది. వెల్లుల్లి నీరు శరీరంలో మెటబాలిజాన్ని వేగంగా పనిచేస్తుంది. దీంతో శరీర కొవ్వు త్వరగా కరుగుతుంది. దీని వాడకం ఆకలిని కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లి నీరు పేగులోని వ్యర్థాలను తొలగిస్తుంది. అంతేకాకుండా అజీర్ణం గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను నుండి దూరం చేస్తుంది.
ఇందులో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. తద్వారా దీని తీసుకుంటే వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో పోరాడే శక్తి వస్తుంది. అయితే రోజు వెల్లుల్లి నీరు తాగితే జలుబు దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేకాకుండా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తూ, చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుంది. ఈ నీరును తీసుకుంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలి?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నలిపి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.