- Advertisement -
బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బందికి బాంబు బెదిరింపు రావడంతో గురువారం భద్రతా చర్యలు మరింత పెంచి కట్టుదిట్టం చేశారు. బుధవారం రాత్రి ఉగ్రవాదుల పేరున ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చిందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. విమానాశ్రయంలో రెండు బాంబులు ప్లాన్ ఎ, ప్లాన్ బి ప్రకారం అమర్చినట్టు, ఒకటి విఫలమైతే రెండోది పనిచేస్తుందని హెచ్చరిక అందింది. అలాగే విమానాశ్రయం టాయిలెట్ పైపులైన్ లోపల పేలుడు పరికరాన్ని అమర్చినట్టు బెదిరించారు. విమానాశ్రయం అంతా పూర్తిగా భద్రతా సంస్థలు తనిఖీ చేశాయని, ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి. ఇ మెయిల్ ఐడి పంపిన నిందితునిపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది.
- Advertisement -