Sunday, June 8, 2025

భార్యను నరికి చంపి.. ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త..

- Advertisement -
- Advertisement -

ఓ వ్యక్తి తన భార్య తల నరికి.. తర్వాత తెగిన తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కర్ణాటక అనేకల్ తాలూకాలోని చందపుర సమీపంలోని హీలలిగే గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శంకర్ అనే వ్యక్తి తన భార్య మానసను వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గొడవపడి హత్య చేశాడు. ఐదు సంవత్సరాల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కోరమంగళలో శంకర్.. బొమ్మసంద్రలో మానస వేర్వేరు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో శంకర్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించడంతో ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. దీంతో మానస తాత్కాలికంగా తన తల్లి ఇంటికి వెళ్లింది. కుమార్తె కోసం రాజీపడేందుకు.. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాట పెరగడంతో కోపంతో రెచ్చిపోయిన శంకర్ భార్యపై కొడవలితో దాడి చేసి.. ఆమె తల నరికి చంపాడడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇంట్లో వదిలి.. తెగిపోయిన తలతో స్కూటర్‌పై సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని, దాడికి ముందు శంకర్ తన నివాసానికి సమీపంలోని దుకాణం నుండి కొడవలిని కొనుగోలు చేశాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News