Monday, June 2, 2025

‘భైరవం’ బ్లాక్‌బస్టర్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ బీభత్సం ‘భైరవం’. (Bhairavam) విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ (Run successfully) అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ బీభత్సం ‘భైరవం’ సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ “సినిమాలో నేను చేసిన గజపతి క్యారెక్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం డబ్బింగ్ కి కష్టపడినంత ఏ సినిమాకి కష్టపడలేదు. డైరెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా క్యారెక్టర్ డిజైన్ చేశారు”అని అన్నారు. హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “నిజానికి ఇలాంటి కథ దొరికినప్పుడే మన నటనకి స్కోప్ ఉంటుంది. అలాంటి కథ భైరవంతో రావడం చాలా ఆనందాన్నిచ్చింది.

ఇది నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ”అని పేర్కొన్నారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ “నిజానికి నేను ఇంత మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. డైరెక్టర్ విజయ్ కారణంగానే అంత బాగా నటించగలిగాను”అని తెలియజేశారు. డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ “కథలో ముగ్గురు హీరోల క్యారెక్టర్స్‌ని బ్యాలెన్స్ చేయడం కష్టం. అందరి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేశాం. -సినిమాకి చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. ముగ్గురు హీరోలకి ఇది అద్భుతమైన కమ్ బ్యాక్ అని ఆడియన్స్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కె.కె.రాధామోహన్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News