Wednesday, September 17, 2025

ఉప్పల్ భారత్ పెట్రోల్ పంపులో ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులను పెట్రోల్ పంపుల యజమానులు మోసాలకు పాల్పడుతుండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మీటర్ రిసెట్ చేయకపోవడంతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌లు పెట్టి మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ బాటిల్ లో నింపించుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పరిదిలో నల్ల చెరువుకట్ట సమీపంలో జరిగింది. భారత్ పెట్రోల్ పంపులో ఓ వాహనదారుడు లీటర్ పెట్రోల్ బాటిల్‌లో కొట్టించాడు. పెట్రోల్ తక్కువ రావడంతో వాహనదారులు యాజమానిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వంద రూపాయలకు అంతే వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకు యాజమానిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News