మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మల్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్ లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పరిస్థితిని రాష్ట్రం లో ఏర్పాటు చేస్తు న్నామని తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులు చేప పిల్లల పెంపకానికి రూ.122 కోట్లు విడుదల చేశా మని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ రూపొంది స్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమ కూర్చే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మహిళల చేత పెద్ద ఎత్తున వ్యాపారం చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజే స్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించి మొదటి సంవత్సరంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 21,600 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
హైటెక్ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లు ఏర్పాటు ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. మహిళలు ఆర్థి కంగా నిలదొక్కుకొని ప్రపంచంతో పోటీ పడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర జిడిపి పెరుగుదలకు దోహదపడుతుందన్న నమ్మకతో ఉన్నామని తెలిపారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు స్వయం సహాయ సంఘాల సభ్యులను గాలికి వదిలేశారని, ప్రజా ప్రభుత్వం రాగానే వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలి పారు. బలమైన కుటుంబ వ్యవస్థ కేవలం మహిళల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో క్రీడలు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు.