కరెంటు రాదు.. తాగునీరు లేదు.. వైద్యం అందదు, గ్రామానికి అంతటికీ ఒక్క బోర్పంపే దిక్కు
విప్పనూనె దీపాలతోనే గ్రామస్తుల కాలక్షేపం, ములుగు జిల్లా భూపతిపూర్ దుస్థితి ఇది
మన తెలంగాణ/కన్నాయిగూడెం : దేశానికి స్వా తంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా విద్యుత్, నీరు, రో డ్లు, వైద్యం వంటి కనీస ప్రాథమిక సౌక ర్యాలు లే ని పల్లెలు చాలా ఉన్నాయి. ఈ కోవలోకి వస్తుంది. ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండలం, సర్వా యి పంచాయతీ, భూపతిపూర్ గ్రామం. చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 25 కుటుంబాలకు చెందిన సుమా రు వందమందికి పైగా ఇక్కడ జనాభా ఉంటారు. వలస వచ్చి ఇక్కడ స్థిరపడి 9 ఏళ్లు గడుస్తున్నా ఈ గ్రామంలో ఇప్పటికీ కరెంట్ సౌకర్యం లేదు. తాగునీటి సదుపాయం లేనే లేదు. నాగులమ్మ గుడి కో సం వేసిన బోర్ పంపు ఒక్కటే ఆ గ్రామస్థులందరికీ జీవనాధారగా మారింది.
అందుకని నాగులమ్మ పే రు మీదగా నాగపూర్ అని పిలుచుకుంటున్నారు ఉంటున్న గొత్తికోయలు. ఒక్క నెలలో రెండు, మూ డుసార్లు చేతి పంపు రిపేర్కు వస్తుందని, ఆ పంపు నీళ్ళు చిలుము వాసన రావడంతో వాగు దగ్గర వె ళ్ళి చెలిమ తీసుకొని నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థి తులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నా రు. భూ పతిపూర్ గ్రామం దగ్గర ఒ క గూడెం ఏర్పాటు చే సుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత మంది సం క్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఆధార్, ఉ పాధి హామీ జాబ్ కా ర్డ్ మొదలైనవి పొందుతున్నారు.
అయితే, వ లస వచ్చి ఏండ్లు గ డుస్తున్నా తమ జీవన విధానంలో మార్పు రావడానికి రాష్ట్ర ప్రభు త్వం చొరవ తీ సుకోవడం లేదని వారు విచా రం వ్యక్తం చేస్తున్నారు. విప్ప కాయ లు దంచి, ఎండబెట్టి వాటిని మెషీన్లో పట్టించి వచ్చిన నూనెను వంటనూనెను దీపాలుగా వా డుతున్నారు. ఈ గూడే నికి వచ్చిన అధికారులకు ఎ న్నిసార్లు తమ దీర్ఘ కాలిక సమస్యలు, ఇబ్బం దులు మొరపెట్టుకున్నప్పటికీ అన్ని సదుపాయా లు వ స్తాయి.. చేస్తాము.. అని చెప్పడమే ఆచరణలో ఏ మాత్రం ఫలితాలు కానరావడం లేదని వాపోతు న్నారు. గతంలో సిఆర్పిఎఫ్ జవాన్లు తమ గూడేనికి వచ్చి నీటి కోసం తాము పడుతున్న అగచాట్ల ను స్వయంగా తెలుసుకొని సింథటిక్ ట్యాంకులు పె ట్టారని, కానీ వాటికి నీ ళ్లు వచ్చే విధంగా పై పులైన్ లేదని అన్నా రు. దీంతో సిఆర్పి ఎఫ్ జవాన్లు ఏడాది కిందట అందజేసిన సింథటిక్ ట్యాంక్స్ వృ ధాగా పడి ఉన్నా యని విచారం వ్యక్తం చే శారు. కొందరికి సిఆర్ పిఎఫ్ జవాన్లు సోలార్లు దీ పాలు అందజేశారు. కరెంటు కోసమని సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చే శారు కానీ వెలగడం లేదని తెలిపారు.
తమలో కొంతమంది చత్తీస్గఢ్ నుంచి సోలార్ దీపాలు తె చ్చుకొని రాత్రిపూట వెలుతురు కోసం తిప్పలు పడుతున్నామని వాపోయారు. ము ఖ్యంగా బ్యాటరీ సోలార్ టార్చ్లైట్లు ఉపయోగించి రాత్రి వేళలో పాముల నుంచి ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి కాలం గడుపుతు న్నా మని అన్నారు. నిత్య అవసరమైన క రెంటు సదుపాయం లేక బయటి ప్రపంచంతో సంబంధం లే కుండా జీవనం కొ నసాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. రా ష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఎవరైనా అధికారులు వస్తే తప్ప తమకేమీ తెలియవని చెప్తున్నారు. గొత్తి కోయలు కోళ్ల పెంపకంలో భాగంగా ప్రత్యేకమైన గూళ్లను గుడిసెకు కింది భాగంలో ఒక కర్రను పైకి పెట్టి దానికి ఒక బుట్ట కట్టి దాంట్లో కోళ్లు ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఇంట్లో కాకుండా గుడిసె చూరు భాగంలో కోళ్లను పెంచుకుంటామని పలువురు తెలిపారు.
కరెంటు సదుపాయం ఉంటే బాగుంటుంది: పంచాయతీ కార్యదర్శి
గొత్తికోయల గ్రామానికి కరెంటు సదుపాయం సదుపాయం ఉంటే బాగుంటుంది. నీటి సదుపా యం కూడా అరకొరగానే ఉంది. నీటిని అందించాలంటే ట్రాక్టర్తో సింథటిక్ ట్యాంక్లో నింపాలి.
మా బతుకులకు వెలుగునివ్వాలి
మునయ్య, గుత్తి కోయవాసి
కరెంటు లేని మా గూడేనికి వచ్చి ,మా బతుకులను చూసి మా పిల్లలకు ఉపయోగపడేలా విద్యుత్, నీటి సదుపాయంతో పాటు పిల్లల కు విద్యను అందించే విధంగా పాఠశాల ఏర్పా టు చేయాలి. మేము చీకట్లో బ తుకుతున్నా. మా పిల్లలకు అయినా కరెంటును చూసే విధంగా ఏర్పాటు చేసి మా బతుకులకు వెలుగునివ్వాలి.