ములాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ తుది దశకు చేరుకుంది. మే 29 సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూతో , పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో పంజాబ్కు ఊహించని షాక్ తగిలింది. జట్టు స్టార్ బౌలర్ మార్కో జెన్సెన్ జట్టుకు దూరమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపయిన్షిప్ ట్రోఫిలో పాల్గొనేందుకు అతను స్వదేశానికి వెళ్లాడు. అతని స్థానంలో అజ్ముతుల్లా ఒమర్జాయ్ని జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.
ఐపిఎల్ (IPL) క్వాలిఫయర్-1కి ముందు జెన్సెన్ మాత్రమే దూరమయ్యాడు అని అనుకొనేలోపే పంజాబ్కు (Punjab Kings) మరో షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ కూడా ఈ మ్యాచ్కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాహల్ చేతి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో గత రెండు మ్యాచుల్లో చాహల్ జట్టులో లేడు. మరి ఈ మ్యాచ్లో అయినా అతన్ని జట్టులోకి తీసుకుంటారా.. లేదా అతని స్థానంలో విజయ్కుమార్ వైశాక్కి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలి.