Sunday, June 29, 2025

మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్: పెళ్లికి ముందు వేరొకరిని ఇష్టపడటం.. తర్వాత తల్లిదండ్రులు చూసిన వరుడిని పెళ్లి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత భర్తను దారుణంగా చంపడటం.. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు దేశంలో సర్వసాధారణంగా మారాయి. పెళ్లి తర్వాత కొన్ని రోజులకే మహిళలు, తమ భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఓ ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వస్తోంది. ఇటీవల రాజా రఘువంశీ అనే వ్యక్తిని తన భార్య హనీమూన్ కు తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి అక్కడే హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా భార్య చేతిలో మరో అమాయక భర్త బలయ్యాడు. తన ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. జూన్ 21న, బండేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమౌనా గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని బిక్కుగా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి.. ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ప్రకారం బిక్కు హత్యకు గురైనట్లు తేల్చారు. మృతుడి భార్య తన ప్రేమికుడి సహాయంతో ఈ హత్యకు కుట్ర పన్నిందని.. ఇద్దరూ కలిసి బిక్కును హత్య చేశారని దర్యాప్తు బృందం తేల్చింది. దీంతో జూన్ 25న మృతుడి భార్యను అరెస్టు చేసి విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించింది. ఆమె ప్రేమికుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News