మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపల్ పరిధిలోని శామీర్పేట వార్డు కార్యాలయంలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రవన్ కుమార్లు రూ. 20 వేలు ఇంటి మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్ గా గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసిబి డిఎస్పి ఆనంద్కుమార్ తూంకుంట మున్సిపాలిటీలో సోదాల అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ యజమాని శామీర్పేటలో రెండు ఇండ్లను కొనుగోలు చేశాడు. ఆ ఇండ్లకు సంబంధించి మ్యుటేషన్ చేయించడానికి సంవత్సరం నుంచి కార్యాలయాల చుట్టు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శామీర్పేట వార్డు కార్యాలయంలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాంరెడ్డి,
కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ కుమార్ బాధితుడి ఇంటికి వెళ్లి మీ ఇంటి మ్యుటేషన్ పెండింగ్లో ఉన్నాయని రూ. 20 వేలు లంచం ఇస్తే మ్యుటేషన్ చేస్తామని ఇంటి యజమానికి చెప్పారు. నేను అంతగా ఇచ్చుకోలేను మ్యుటేషన్ చేయాలని కార్యాలయం చుట్టు తిరిగాడు. అయినా చేయకపోవడంతో విసుగుచెంది యజమాని లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనలతో వారిని కలిశాడు. రూ.20 వేలు డబ్బులు లంచంగా ఇస్తుండగా శ్రవణ్ కుమార్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంకా ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఏసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు.