Friday, June 20, 2025

బిజెపిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం… సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణకు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ పెట్టారు. దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇన్‌ఛార్జ్‌గా మాగం రంగారెడ్డి పని చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తొలి దరఖాస్తు రవి ప్రసాద్ గౌడ్ అందించారు. జనగామ నుంచి జగదీష్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. క్రాంగెస్ కూడా దరఖాస్తులను స్వీకరించిన అనంతరం స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు సమాచారం.

Also Read: చంద్రయాన్–3 కౌంట్‌డౌన్ స్వరం ఇక వినిపించదు: ఇస్రో శాస్త్రవేత్త వలర్‌మతి కన్నుమూత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News