Thursday, June 12, 2025

రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రయత్నిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం పరిరక్షణే ధ్యేయంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్‌ను చేపట్టాం
టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం పరిరక్షణే ధ్యేయంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. దేశ సమగ్రతకు తూట్లు పొడిచే విధంగా ప్రధాని, అమిత్ షాలు వ్యవహాహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అధికారమే పరమావధిగా అధికారం లేకుంటే బ్రతకలేమన్న విధంగా బిజెపి నేతలు వ్యవహారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ స్వలాభం కోసం బిజెపి నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దేశ విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

పదేళ్లు అధికారంలో ఉండి కూడా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేని స్థితిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉందన్నారు. 400 సీట్లు వస్తాయని నమ్మ బలికిన బిజెపి నేతలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెపారని అయినా వారిలో మార్పు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. పిసిసి కార్యవర్గంలో 70 శాతం మేరకు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించి సామాజిక న్యాయానికి, మహిళలకు పెద్దపీట వేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News