Friday, May 30, 2025

కవిత చెప్పింది నిజమే:ఎంఎల్‌ఏ రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీని బిజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని బిజేపీ ఎంఎల్‌ఏ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ద ప్యాకేజి దొరికితే బిజెపి నాయకులు ఎప్పుడో పార్టీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసేవారంటూ కూడా ఆయన తన సొంత పార్టీపై సంచలన ఆరోపణ చేసారు. బిజెపి, బిఆర్‌ఎస్ కలిస్తే వచ్చే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి పోటీ చేయాలంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలో బిఆర్‌ఎస్ నాయకులే నిర్ణయిస్తారేమో అని ఆయన విమర్శించారు.

గతంలో కూడా ఇలాంటి పరిణామాల వల్ల బిజేపీ నష్టపోయిందని రాజాసింగ్ వాపోయారు. ప్రతి ఎన్నికల్లో కొందరు బిజెపి నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కు కావడంతో పార్టీకి నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి ఎందుకు రాలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడో బిజెపి ప్రభుత్వం రావాలని, కాని, ఇతర పార్టీ నాయకులతో కుమ్మక్కు కావడం అందరికి తెలిసిన విషయమే అని వ్యాఖ్యానించారు. ౦

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News