హైదరాబాద్: బిజెపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఒకేరోజు రెండు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను (BJP Presidents) అధిష్టానం ప్రకటించనుంది. తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరించి.. జూలై 1వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారని పార్టీ ప్రకటన విడుదల చేసింది..
అటు ఎపిలోనూ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. పార్టీ ఎన్నికల ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. రాజ్యసభ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ పాకా సత్యనారాయణ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని.. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ.. అదే రోజు సాయంత్రం ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.