Saturday, June 14, 2025

బ్లాక్‌బాక్స్ లభ్యం

- Advertisement -
- Advertisement -

బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిన బ్లాక్‌బాక్స్‌ను
గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్న
దర్యాప్తు బృందం ప్రమాద ఘటన విచారణలో ఇదే
కీలకం ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని నరేంద్ర
మోడీ మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని
సీనియర్ అధికారులతో సమీక్షాసమావేశం అన్ని
బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలకు డిజిసిఎ ఆదేశం
డ్రీమ్‌లైనర్‌శ్రేణి విమానాలకు ఇక విరామం? కొనసాగుతున్న
డిఎన్‌ఎ పరీక్షలు గుర్తింపు తరువాత ఆరుగురి భౌతిక
కాయాల అప్పగింత విమానం కూలినప్పుడు ఎగిసిన
అగ్నిగోళం 1000డిగ్రీల సెల్సియస్‌కు చేరిన ఉష్ణోగ్రత
పరిసరాలలోని పక్షులు, జంతువులు సైతం మాడిమసి
మృత్యుంజయుడికి వరస్ట్ సీటే వండర్ అయింది

అహ్మదాబాద్ : ఘోర ప్రమాదపు బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు ఈ బ్లాక్‌బాక్స్ అత్యంత కీ లకం అవుతుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బ యలుదేరిన కొద్ది నిమిషాలకే పతనం అయిన ఈ వి మానం బ్లాక్‌బాక్స్ ఇప్పుడు ఇక్కడ తాను ఢీకొన్న భ వనంపై కప్పు నుంచి లభ్యం అయిన విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీనితో విమాన ప్ర మాదంపై దర్యాప్తు మరింత వేగవంతం అవుతుంది. అనుకోని దుర్ఘటనలు విమానాల్లో సంభవించినప్పుడు లోపల అంతిమక్షణాలలో పరిస్థితిని ఈ బ్లాక్‌బాక్స్ రి కార్డు చేస్తుంది. పేలుళ్ల, పగుళ్ల నుంచి భద్రంగా ఈ పె ట్టె నిర్మితం అయి ఉంటుంది. విమానపు తోక వద్ద ఈ బ్లాక్‌బాక్స్‌ను కనుగొన్నారు. విమాన ప్రమాదాల ద ర్యాప్తు సంస్థ (ఎఎఐబి) బృందం తనిఖీలలో ఈ బ్లాక్‌బాక్స్‌ను రెసిడెన్స్ డాక్టర్ల హాస్టల్ బిల్డింగ్‌పై పడి ఉం డగా గుర్తించారు. దీనితో అధికారులలో టెన్షన్ తగ్గిం ది. ఈ బాక్స్ దొరికిన విషయాన్ని వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారులకు ఎఎఐబి టీం నిర్వాహకులు తెలిపారు.

ఈ పరిణామంతో ద ర్యాప్తు వేగిరపర్చేందుకు వీలేర్పడుతుందని ఆ తరువా త మంత్రి రామ్మోహన నాయుడు మీడియాకు తెలిపా రు. ఈ బ్లాక్‌బాక్స్‌ను ఫ్లెయిట్ డేటా రికార్డర్ అని వ్యవహరిస్తారు. ప్రమాదం తరువాత 28 గంటలకు దీనిని కనుగొన్నారు. బ్లాక్‌బాక్స్ రికవరి తరువాత దీనిని క్షు ణ్ణంగా సంబంధిత నిపుణులు తనిఖీ చేస్తారు. ఇం దులో రికార్డు అయిన విషయాలకు అనుగుణంగా దర్యాప్తు సాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రమాద స్థలి వద్దకు గుజరాత్ ప్రభుత్వ ఆధీనంలో వివిధ విభాగాలలో పనిచేసే 40 మందికి పైగా ఉద్యోగులు ఇప్పుడు ఇక్కడ సహాయక చర్యలు సాగుతున్న వైమానిక శాఖ సిబ్బందికి తోడుగా వచ్చి నిలిచారు. పలు పనులలో పాల్గొంటున్నారు . ప్లేన్లలో భ ద్రపరిచే ఉండే బ్లాక్‌బాక్స్‌లలో రెండు ముఖ్య భా గాలు ఉంటాయి. ఒకటి ఫ్లేయిట్ డేటా రికార్డర్ ( ఎఫ్‌డిఆర్).రెండోది కాక్‌పిట్‌వాయిస్ రికార్డర్ (సివిఆర్ ). విపత్కర పరిస్థితుల మధ్య పైలట్ ఇతర విమాన సి బ్బంది సంభాషణ, వారు తెలిపిన వివరాలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. ఇవి చెక్కుచెదరకుడా ఉంటాయి. ఎఫ్‌డిఆర్‌తో విమానంలో తలెత్తిన తుది క్షణపు సాంకేతిక సమస్యలు, సవరించుకోవడానికి వీల్లేని క్లిష్టతల విషయాలు పొందుపర్చి ఉంటాయి. ఇక ఇద్దరు పైలట్ల తుది మాటలు సివిఆర్‌లో నిక్షిప్తం అవుతాయి.

ఇవి ప్రమాద కారణాల విశ్లేషణకు ఉపయోగపడుతాయని అధికారులు తెలిపారు. సాధారణంగా బ్లాక్‌బాక్స్‌ను ప్లేన్ చివరి భాగంలో అమర్చి ఉంచుతారు. విమానం ఎప్పుడూ దాని అబిముఖం వైపు కూలిపోతుంది. బ్లాక్‌బాక్స్ వెనుక వైపు ఉండటం , ఇది దుర్భేధ్యం కావడతో ఇందులో అన్ని విషయాలు పదిలపర్చుకుని ఉంటాయి. అత్యంత వేడిమి అంటే దాదాపు 1,100 సెంటీగ్రేడ్‌ల వేడిని కూడా తట్టుకుని ఇందులో సమాచారం కనీసం గంట వరకూ భద్రంగా ఉంటుంది. బ్లాక్‌బాక్స్ కాకుండా విమానంలో ఉండే డిజిటల్ వీడియో రికార్డర్ (డివిఆర్) కూడా దర్యాప్తునకు సహకరిస్తుంది. విమానంలోని పలు సిసికెమెరాలలో అంతిమ దశలలో నెలకొన్న పరిస్థితి ఈ పరికరంలో భద్రపర్చి ఉండేలా అమరికలు ఉంటాయి. కాక్‌పిట్, క్యాబిన్‌లలోని పరిణామాలను, పరిస్థితులను సరైన రీతిలో అంచనావేసేందుకు ఈ ఏర్పాటు దోహదం చేస్తుంది. దీనితో దర్యాప్తు క్రమంలో సంబంధిత దృశ్య రూప వీడియోలు ద్వారా పలు కీలక విషయాలు, ప్రత్యేకించి విమానంలో విపత్కర పరిస్థితుల్లో ఏమి జరిగింది? ఎందుకు జరిగింది? అనేది తేల్చుకోవడానికి వీలేర్పడుతుంది.

పూర్తి స్థాయి దర్యాప్తుతోనే ప్రమాద కారణాల నిర్థారణ : నిపుణులు
ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు క్రమంలో కానీ వెలుగులోకి రావని వైమానిక విషయాల నిపుణులు తెలిపారు. ముందుగా ప్రాధమిక స్థాయిలో కొన్ని కారణాలను విశ్లేషించుకోవడం జరుగుతుంది. అయితే సమగ్ర దర్యాప్తు తరువాతనే ఖచ్చిత రీతిలో ప్రమాద లోగుట్టును నిర్థారించుకునేందుకు వీలవుతుంది. కారణాలు ఏమై ఉంటాయనేది వెంటనే చెప్పడం కష్టం అని, గగనతలంలో లేదా విమానంలో తలెత్తే పరిణామాలు పూర్తి స్థాయి దర్యాప్తు తరువాతనే నిర్థారితం అవుతాయని వివరించారు. బుధవారం ప్రమాదానికి గురై, భారీ సంఖ్యలో ప్రాణ నష్టానికి దారితీసిన విమానం ఉదంతంపై నిపుణులు శుక్రవారం స్పందించారు. ఇక ఇప్పటి డ్రీమ్‌లైనర్ విమానం చరిత్ర పరిశీలిస్తే కొన్ని వివాదాస్పద అంశాలు ఉండవచ్చు.

అయితే దీని సాంకేతిక అంశాలను విశ్లేషించుకుంటే ఇది విమానరంగ పరిశ్రమకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ డ్రీమ్‌లైనర్ ఇటువంటి ప్రమాదానికి గురి కావడం ఇదే తొలిసారి అని ఎయిరిండియా మాజీ కార్యనిర్వాహకులు జితేంద్ర భార్గవ తెలిపారు. ఇప్పటి విమాన ప్రమాదానికి కారణాలు ఏమిటనేవి వెనువెంటనే చెప్పడం సశాస్త్రీయం అన్పించుకోదు. పక్షి ఢీ ఘటన జరిగిందా? లేక ఇంధన జ్వలన కారణమా అనేవి ఏవి కూడా నిర్థారిత అంశాలు కావని ఆయన వెల్లడించారు. భారీ ప్రమాదంపై పలు ఊహాగానాలు నష్టాన్ని కల్గిస్తాయి. దర్యాప్తు విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ పరిశ్రమం వారు కానీ, మీడియా వారు కానీ ప్రమాదం కారణాలపై ఇప్పటికిప్పుడు ఎటువంటి అభిప్రాయాలకు రాకూడదు. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసే వరకూ వేచి ఉండటం మంచిదని సలహా ఇచ్చారు.

26 బోయింగ్ డ్రీమ్‌లైనర్లకు స్థాయి తనిఖీలు
వైమానిక నిఘా సంస్థ డిజిసిఎ ఆదేశాలు
బుధవారం డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదంతో ఇక ఈ శ్రేణి విమానాలన్నింటిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. తరువాతనే వీటిని విమానయానానికి పంపిస్తారు. వెంటనే ఈ ఎయిరిండియా బోయింగ్ 787 రకం డ్రీమ్‌లైనర్ విమానాలన్నింటిని సాంకేతికపరంగా పరిశీలించాల్సి ఉంటుందని ఏవియేషన్ నిఘా సంస్థ డిజిసిఎ శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. ఇప్పుడు ఎయిరిండియా వద్ద 26 ఇటువంటి బోయింగ్ విమానాలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఆధీనంలోకి ఎయిరిండియా ఇటీవలే వచ్చింది. క్రమేపీ పుంజుకొంటోన్న దశలోఈ విమాన దుర్ఘటన జరిగింది. ఎయిరిండియాకు తాజాగా ఆదేశాలు వెలువరించారు. విమానాలకు అదనపు నిర్వాహణ చర్యలు చేపట్టాలని తెలిపారు. జెన్‌క్స్ ఇంజిన్లతో ఉన్న బోయింగ్ 787 8, 7878 విమానాలు ఈ తనిఖీల పరిధిలోకి వస్తాయని వెల్లడైంది. ఈ తనిఖీలన్నింటిని డిజిసిఎ ప్రాంతాలయ కార్యాలయాల పరిధిలో అక్కడి అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News