అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై (Flight Crash) కీలక అప్డేట్ వచ్చింది. ప్రమాదానికి గురైన విమాన బ్లాక్బాక్స్ (Black Box) లభ్యమైంది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాథీనం చేసుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) అధికారులు వెల్లడించారు. ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బాక్స్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా.. మరొకటి కాక్పిట్ వాయిస్ని రికార్డు చేస్తుంది. విమానానికి ప్రమాదం వాటిల్లినప్పుడు, ఆ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ.. ‘మేడే’ అనే సందేశాన్ని సమీప ఎటిసికి పంపుతారు. వీటితో పాటు పైలట్ – కో పైలట్ సంభాషణలు డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్(డిఎఫ్డిఆర్)లో రికార్డవుతాయి. దాన్నే బ్లాక్ బాక్స్ అంటారని ఎఎఐబి అధికారులు వివరించారు.
బ్లాక్బాక్స్ (Black Box) లభ్యం కావడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది కూడా పౌరవిమానయాన శాఖ బృందంలో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కాగా, గురువారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి (Flight Crash) గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మినహా విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విమానం బ్లాక్బాక్స్ లభ్యం కావడంతో ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది.