ప్రయాణాల్లో ఆలస్యం అయినా తప్పదు మరి
న్యూఢిల్లీ : ఘోర ప్రమాదం జరిగిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం బోయింగ్ 7878/9 రకానికి చెందినది. పేలవమైన సాంకేతికత, ఇతరత్రా ఇంజిన్ వైఫల్యాలే విమాన పతనానికి దారితీశాయని, టేకాఫ్ దశలో నిర్ణీత ఎత్తును చేరుకోకపోవడం వల్లనే విమానాశ్రయ సమీపంలో విమానం మంటల్లో కాలి కూలిందని నిర్థారణ అయింది. దీనితో పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ రకం విమానాలన్నింటిని పూర్తి స్థాయి సమగ్ర తనిఖీల తరువాతనే ప్రయాణాలకు అనుమతిస్తున్నారు. ఆదివారం నుంచి ఈ తనిఖీల ప్రక్రియ వేగవంతం చేశారు.
వీటి ఫ్యూయల్ , ఇంజిన్, హైడ్రాలిక్ వ్యవస్థల భద్రతను తనిఖీ చేసిన తరువాతనే వీటిని నిర్ణీత ప్రయాణ మజిలీలకు అనుమతిస్తారు. ఈ క్రమంలో జరిగే జాప్యం ,విమానాల రాకపోకలలో ఆలస్యం వంటి పరిణామాలను అర్థం చేసుకుని , సహకరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురై ఇప్పుడు ఈ విమానాలలో ప్రయాణం ఎంత మేరకు భద్రతాయుతం అనే కీలక ప్రశ్నలను మిగిల్చింది. ఎయిరిండియాకు ఇది తీవ్ర సమస్యగా మారింది.