Monday, June 23, 2025

గద్వాల్ లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో

- Advertisement -
- Advertisement -

గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సత్యసాయి విద్యా మందిర్ సమీపంలో బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్త వల్ల విద్యుత్ స్తంభానికి వాహనం ఢీకొట్టింది. వాహనం వేగం తక్కువగా ఉండడంతో విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగింది. విద్యుత్ స్తంభం కిందపడిపోయే ఉంటే ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. అలాగే విద్యుత్ అధికారులు స్పందించి పక్కకు ఒరిగిన స్తంభాన్ని సరిచేయగలరని గద్వాల్ పట్టణ ప్రజలు కోరుతున్నారు. రోడ్డుకు ఇరువైపుల కాకుండా దూరంగా విద్యుత్ స్థంభాలన్నీ నాటాలని స్థానికులు సలహా ఇస్తున్నారు.  వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్లు అస్తవ్యస్థంగా ఉండడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు డ్యామేజ్ కావడంతో ప్రమాదాలు జరగడంతో పాటు వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News