- Advertisement -
ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో బాంబు ఉందంటూ ఢిల్లీ అండ్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కి మెయిల్ వచ్చింది.వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు , బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అయితే వారికి మైదానంలో ఎలాంటి అనుమానపు వస్తువులు కనిపించలేదు. దీంతో ఇది ఫేక్ మెయిల్ అని తేలిపోయింది.రెండు రోజులుగా పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా దాడులకు దిగుతోంది. ఈ కాల్పులను భారతీయ సైన్యం అన్ని స్థాయిల్లో తిప్పికొడుతున్న విషయం తెలిసిందే.
- Advertisement -