- Advertisement -
కేరళ లోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు. ఇండిగో విమానం మంగళవారం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఈ క్రమంలో విమానం నంబరును ప్రస్తావిస్తూ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నాగ్పూర్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే విమానం లోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. బాంబు స్కాడ్ బృందం విమానంలో తనిఖీలు చేస్తుంది. సోమవారం జర్మనీ లోని ఫ్రాంక్ఫర్డ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ విమానాన్ని మళ్లీ ఫ్రాంక్ఫర్డ్కు మళ్లించారు.
- Advertisement -