- Advertisement -
సోమవారం మధ్యాహ్నం శ్రీశైలంలో ఆలయ (Srisailam Temple) సమీపంలో అనుమానస్పదంగా ఉన్న ఓ సంచిని స్థానికులు గుర్తించారు. ఆలయ సమీపంలో ఉన్న వాసవీ సత్రం ఎదురుగా ఉన్న డివైడర్పై ఇవి లభ్యమయ్యాయి. సంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాంబు స్క్వాడ్తో వచ్చి తనిఖీలు చేయగా.. సంచిలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్ద బుల్లెట్లు, 4 చిన్న బుల్లెట్లు మరో నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ సంచిని ఎవరూ అక్కడ పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైల దేవస్థానానికి చెందిన సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
- Advertisement -