Monday, June 2, 2025

టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం: బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: మూడు రోజులు కడపలో టిడిపి మహానాడు డ్రామా అని మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను టిడిపి నేతలు మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు. పెన్షన్‌ పెంపు తప్ప ఏ హామీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని, టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 1650 మంది రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్నారని, ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బొత్స చురకలంటించారు. గతంలో 500 మంది కంటే ఎక్కువ విద్యార్థులు రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్న దాఖలు లేవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News