Thursday, September 18, 2025

13 రోజుల క్రితం చదువులమ్మ తల్లి మృతి… 510 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థిని

- Advertisement -
రాజన్న సిరిసిల్ల: 13 రోజుల క్రితం మృతి చెందిన బాలిక పదో తరగతి ఫలితాలలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల  నాగచైతన్య(15) అనే బాలిక తన తల్లిదండ్రులతో ఉంటుంది. మల్లాపూర్ ప్రభుత్వ స్కూల్ లో నాగ చైతన్య పదో తరగతి చదువుతోంది. అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 17న నాగచైతన్య కన్నుమూసింది. పదో తరగతి ఫలితాలలో నాగ చైతన్య 510 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మా ఇంటి చదువులమ్మ తల్లిని దేవుడు తీసుకెళ్లాడని తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News