ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లను వెలికితీస్తుంది. ఈ లీగ్లో సక్సెస్ అయిన వాళ్లు ఆయా దేశాల జాతీయ జట్లలో ఆడి ఎన్నో విజయాలను సాధించారు. తాజాగా ఈ ఏడాది ఐపిఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఇంగ్లండ్లో జరిగిన వైటాలిటీ టి-20 బ్లాస్ట్ 2025లో చెలరేగిపోయాడు. హ్యాంప్షైర్ తరఫున ఆడుతున్న బ్రెవిస్ ఎస్సెక్స్తో జరిగిన మ్యాచ్లో అర్థశతకం సాధించాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. బ్రెవిస్తో (Dewald Brevis) పాటు అతని తోటీ ఆటగాళ్లు టాబి ఆల్బర్ట్ (54), జేమ్స్ విన్స్ (62) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో హ్యాంప్షైర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో ఎస్సెక్స్ చేతులెత్తేసింది. హాంప్షైర్ బౌలర్లు డాసన్ 4 వికెట్లు, స్టార్ కర్రీ 2 వికెట్లు పడగొట్టడంతో 16.2 ఓవర్లలో 124 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఎస్సెక్స్ బ్యాటింగ్లో కైల్ పెప్పర్ ఒకడే అర్థశతకం చేయగా.. రొస్సింగ్టన్ 18, వాల్టర్ 23 పరుగులు చేశారు. మిగితా వారందరూ స్పల్పస్కోర్కే పరిమితమయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో 106 పరుగుల తేడాతో హైంప్షైర్ విజయం సాధించింది.