- Advertisement -
కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండల కేంద్రంలోని గన్నేరువరం ఊర చెరువు మత్తడి పోసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చెరువు నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో ఇరుపక్కల రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలో బుధవారం ఓ పెళ్లి చేరుకోవాల్సిన పెళ్లికొడుకు వాహనం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో చెరువు కట్టపై నిలిచిపోయింది. పెళ్లికొడుకు ఉన్న కారు నాలుగు గంటల పాటు చెరువు కట్టపై వేచిచూసినా వరద ఉద్ధృతి తగ్గలేదు. ఇక ముహూర్త సమయం దగ్గర పడుతుండడంతో బంధువులందరూ విధి లేని పరిస్థితిలో పెళ్లికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకెళ్లారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కల్వర్టు వల్ల ఇబ్బందులు పడుతున్నామని వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -