భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్లో ఓ వంతెన నిర్మాణంలో ఇంజనీర్లు అతి తెలివి ప్రదర్శించారు. భోపాల్లోని ఐష్బాగ్ ప్రాంతంలో 90 డిగ్రీల మలుపుతో ఆర్ఒబిను నిర్మించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో పూర్తిగా ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేసి.. మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్పై శాఖపరమైన విచారణకు ఆదేశించింది.
దీనిపై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్ఒబి నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఏడుగురు పిడబ్ల్యూడి ఇంజనీర్లను తక్షణమే సస్పెండ్ చేశామని.. నిర్మాణ ఏజెన్సీ, డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్ట్లో పెట్టామని తెలిపారు. ఆర్ఒబి పునరుద్ధరణకు కమిటీ వేశామన్నారు. అయితే ఈ డిజైన్ను నిర్మాణ సంస్థ సమర్థించుకుంటుంది. సమీపంలో మెట్రో రైల్వేస్టేషన్, భూమి కొంత ఉన్న కారణంగా ఇలా నిర్మించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొంది. కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉంటే నిర్మాణం మంచిగా ఉండేదని వివరణ ఇచ్చింది.