Monday, June 2, 2025

రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో వంతెన కూలి రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏడుగురు మృతి చెంగా.. మరో 30 మంది గాయపడ్డారు. రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రాయిటర్స్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్‌ వెల్లడించింది. ప్యాసింజర్ రైలు.. మాస్కో నుండి క్లిమోవ్‌కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అత్యవసర సేవలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారికి సంఘటనాస్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి తర్వాత ఆస్పత్రికి తరలించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News