- Advertisement -
హైదరాబాద్: బిజెపి, బిఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొందరు బిజెపి సీనియర్ నేతలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ చెప్పినట్లు లోక్సభ టికెట్లు కూడా కెసిఆర్ సూచనలతోనే ఇచ్చారని ఆరోపణలు చేశారు. రేపో మాపో బిజెపిలో బిఆర్ఎస్ విలీనమవుతోందని, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
- Advertisement -