మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలోని డల్లాస్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల (BRS silver jubilee celebrations) నిర్వహణ సందర్భంగా జరిగే బారీ బహిరంగ సభ కు డల్లాస్ నగరం ముస్తాబైంది. బిఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ నగరాల నుంచి తెలంగాణ వాదులు ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, తానా, ఆటా సంస్థల ప్రతినిధులతో పాటు, సభకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేని తెలుగువాళ్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 2001 నుంచి 2014 దాకా కెసిఆర్ నాయకత్వంలో ఎన్ఆర్ఐలు తమ స్థాయిలో పోరాటంలో భాగస్వాములయ్యారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అమెరికాలో జరుగుతున్న పోరాటాలకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు ఉద్యమించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఎ ప్రభుత్వం, యూఎస్లో బిఆర్ఎస్ ఎన్ఆర్ఐలు టిడిఎఫ్, ప్రతినిధులతో కలిసి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు అమెరికాలో పర్యటించిన సందర్భంలో తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొనేందుకు యూఎస్ఎ వచ్చిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురిని నిలదీసిన సందర్భాన్ని తెలంగాణ ఎన్ఆర్ఐ డల్లాస్ సభ నేపథ్యంగా గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కెసిఆర్ నాయకత్వంలో (BRS silver jubilee celebrations) తెలంగాణ పురోభివృద్ధికి వడివడి అడుగులు, పదేండ్లు తెలంగాణ సాధించిన ప్రగతిని ఎన్ఆర్ఐలు నెమరువేసుకున్నారు. గత పది రోజులుగా బిఆర్ఎస్ ఎన్నారై యూఎస్ చైర్మన్ మహేశ్ తన్నీరు, ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సహా యూఎస్లోని ఎన్ఆర్ఐ విఘాగానికి తోడు పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల సందర్భంగా తెలంగాణ వాదులు ప్రదర్శించిన ఉత్సాహం, ఆసక్తి డాక్టర్ పెప్పర్ ఎరినా సాక్షిగా తొణికిసలాడింది.
డల్లాస్లో కెటిఆర్..బిఆర్ఎస్ శ్రేణుల ఘనస్వాగతం
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు బిఆర్ఎస్ (ఎన్ఆర్ఐల) యూఎస్ఎ విభాగ ప్రతిని ధులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్య నాయకులు కెటిఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరి కాలోని డల్లాస్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు అంగరంగం వైభవంగా జరుగుతున్నాయి. డల్లాస్లో డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం లో జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డల్లాస్ చేరుకున్నారన్నారు, పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారన్నా రు. అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ డల్లాస్కి చేరుకున్నారు.
అదే విధంగా డల్లాస్ లో ఉన్న తెలుగు వారు అమెరికా నుంచి వస్తున్న వారందరికీ ఆతిథ్యమిచ్చారు. కెసిఆర్ పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఎదిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో, కెటిఆర్ దూరదృష్టితో తెలం గాణ ఇంటి పార్టీ బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపగలదని గట్టి విశ్వాసం కనబర్చారు. ఈ రజతోత్స వం ఒక కొత్త ఉద్యమానికి నాంది పలకాలన్నారు. బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశం ఏర్పాట్లను ఎన్ఆర్ఐ కోఆ ర్డినేటర్ మహేశ్ బిగా ల, బిఆర్ఎస్ యుఎస్ఎ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పరిశీలించారు. అమెరికాలో నిర్వహించే రజతోత్సవ సభ బిఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.