ముంబయి: టీమిండియా ఇంగ్లాండ్ టూర్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుందని బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో సిరీస్లో టీమిండియా ఐదు మ్యాచ్లు ఆడనుందన్నారు. టీమ్ ఇండియా జట్టును ప్రకటించిన నేపథ్యంలో అజిత్ మీడియాతో మాట్లాడారు. టీమ్ఇండియా పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయాలు పాలు కావడంతో అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడంలేని, అదుకే అతడి కెప్టెన్ గా ఎంపిక చేయలేదని అగార్కర్ వెల్లడించారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. బ్యాట్స్ మెన్ సుదర్శన్, ఫేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. తొమ్మిది ఏళ్ల తర్వాత కరుణ్ నాయర్కు పిలుపు వచ్చింది.
టీమిండియా జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్(వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమాన్యు ఈశ్వరన్, కరుణ్ నాయిర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్రజడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, షార్థూల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్