Tuesday, June 10, 2025

 చిత్తూరులో బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Bus accident in Chiittore

40 మందికి పైగా గాయపడ్డారు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం అర్థరాత్రి వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు భాకర్‌పేట సమీపంలోని ఘాట్ రోడ్డులో ఏటవాలు వంపు తిరుగుతుండగా  లోయలో పడిపోవడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు అనంతపురం జిల్లాకు చెందిన వారు.  కాగా వారు ఆదివారం ఉదయం జరగాల్సిన వివాహ నిశ్చితార్థానికి వెళుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News