- Advertisement -
ఆదిలాబాద్: ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టి ఆర్టిసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. పశువులను తప్పించబోయి ఆటోను ఢీకొని బస్సు బోల్తా పడింది. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నాలుగు పశువులు కూడా మృత్యువాతపడ్డాయి.
- Advertisement -