ఉద్యోగుల ఆరోగ్యబీమాపై ట్రస్ట్ ఏర్పాటు . ఉద్యోగులు నెలకు రూ.500 చెల్లిస్తే అంతే మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మొత్తం ట్రస్ట్ ఖాతాలో జమ . ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు వస్తే ట్రస్ట్ ద్వారా చెల్లింపులు . ఎన్నికల సమయంలో చేసిన బదిలీలు వెనక్కి . ఉద్యోగుల కోసం నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు . అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.2లక్షలకు వర్తింపు . మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు మరణిస్తే రూ.10లక్షల చెల్లింపు . 385 బాధిత కుటుంబాల కోసం రూ.38.5కోట్లు స్త్రీనిధికి కేటాయింపు . ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12ఎకరాలు కేటాయింపు. పంచాయతీ రోడ్లకు రూ.18780కోట్లు, ఆర్అండ్బి రోడ్లకు రూ.16,414కోట్లు.
జాయింట్ వెంచర్గా హైదరాబాద్ మెట్రో2 నిర్మాణం. ఐదున్నర గంటలకుపైగా సాగిన కేబినెట్ సమావేశం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలిపిన డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి పొంగులేటి
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు డిఏలను ఉ ద్యోగులకు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని, ఒక డిఏను ఇప్పుడు మరో డిఏను ఆరునెలల తరువా త చెల్లించాలని నిర్ణయించినట్టు ఉద్యోగుల డిమాండ్లపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇందులో ప్రధానంగా డిఏల చెల్లింపులతో పాటు ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ట్రస్టుకు సిఎస్ చైర్మన్గా ఉంటారని ఆయన తెలిపారు. ప్రతి ఉద్యోగికి హెల్త్కా ర్డు ఇవ్వాలని దానికి సంబంధించి ప్రతినెలా రూ. 500లు చెల్లించడంతో పాటు దానికితోడు ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని వాటాగా చెల్లిస్తుందని ఆయ న తెలిపారు. అలాగే, ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇకనుంచి ప్రతినెలా రూ.700 కో ట్లకు తగ్గకుండా చెల్లించాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
వివిధ హెచ్ఓడిల్లో పనిచేసే ఉద్యోగులకు సచివాలయంలో 12.5 శాతం కోటాను అమలు చేయాలని ఉద్యోగుల చేసిన డిమాండ్కు మంత్రివర్గం సానుకూలత వ్యక్తం చేసినట్టు ఆ యన తెలిపారు. ఉద్యోగి మెడికల్ ఇన్వాల్డేషన్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, రిటైర్ అయిన వారిని మళ్లీ రిక్రూట్మెంట్ చేయకూడదని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్కు కేబినెట్ అంగీకరించిందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల పనితీరును బట్టి వాటికి గ్రేడింగ్ ఇ వ్వాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డిపిసిలను రెగ్యులర్గా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన ఉద్యోగులను ఎన్నికలు ముగియగానే తిరిగి వారి యధాస్థానాలకు పంపించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్లో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకా లు గ్రీన్సిగ్నల్ ఇచ్చామని దీంతోపాటు నర్సింగ్ డైరెక్టర్ కావాలని ఉద్యోగ సంఘాలు అడిగారని దానిని కూడా ఆమోదించినట్టుగా ఆయన తెలిపారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ వారి యధాస్థానాలకు పంపించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
జిల్లా పరిషత్లో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చామని దీంతోపాటు నర్సింగ్ డైరెక్టర్ కావాలని ఉద్యోగ సంఘాలు అడిగారని దానిని కూడా ఆమోదించినట్టుగా ఆయన తెలిపారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించామని, అద్దె వాహనాలకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు వాటి అద్దెను ఖరారు చేయబోతున్నామని ఆయన తెలిపారు. జిఓ 317ను పునః పరిశీలిస్తామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు.
385 బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెంలో ఏర్పాటు చేయబోమే ఎర్త్ సైనెన్స్ యూనివర్శిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. మహిళా సంఘాలకు ప్రమాద బీమా అమలు కోసం రూ.38.5 కోట్లను స్త్రీనిధికి కేటాయించాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా నేరుగా స్త్రీనిధి ద్వారా 385 బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు. హ్యామ్ విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందన్నారు.
పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.16,780 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్లకు రూ.16,414 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 7,947 కిలోమీటర్లు, ఆర్ అండ్ బి పరిధిలో 5,190 కిలోమీటర్లు మొత్తంగా 13,037 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.16,780 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్లకు రూ.16,414 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ఈ విధానంలో చేపట్టే రోడ్ల నిర్వహణ బాధ్యత 15 సంవత్సరాల పాటు వాటిని చేపట్టిన ఏజెన్సీలపైనే ఉంటుందని ఆయన తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్గా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో ఫ్యాకేజీగా విభజించి అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు కింద 86.1 కిలోమీటర్కు రూ.19,579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందులో కారిడార్ 1లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ వరకు 39.6 కి.మీలు, కారిడార్ 2 కింద జూబ్లీ బస్స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీలు, కారిడార్ 3 కింద జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు 22 కి.మీల నిర్మాణం చేపట్టబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కేంద్రాన్ని ఒప్పించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.