Sunday, June 8, 2025

మంత్రివర్గంలోకి వివేక్, అడ్లూరి, శ్రీహరి.. మధ్యాహ్నం ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్తగా ఎంపిక చేసిన మంత్రుల జాబితాను ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు తెలుస్తోంది. కెబినేట్ లో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ కెబినేట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సి మాల, ఎస్సి మాదిగ, బిసి ముదిరాజ్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. వీరిలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరి ముగ్గురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్ భవన్ లో వీరు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, డిప్యూటీ స్పీకరక్ గా రామచంద్రు నాయక్ ఖరారయ్యారు. అయితే, ఈ ముగ్గురికి చోటు దక్కినా.. మంత్రి వర్గంలో ఇంకా మూడు ఖాలీలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News