గిరిజన ప్రాంతాల్లో గిరిజన సొసైటీల ద్వారానే ఇసుక అమ్మకాలు
జరపాలి జిల్లా కేంద్రాల్లోని విలువైన భూములను గుర్తించి సంరక్షణ
చర్యలు చేపట్టాలి వనరుల సమీకరణ కేబినెట్ కమిటీ భేటీలో
అధికారులకు డిప్యూటీ సిఎం భట్టి సూచన
మన తెలంగాణ/ హైదరాబాద్ : గత సంవత్సరంతో పోలిస్తే వాణిజ్యపన్నుల శాఖలో ఆరు శాతం ప్రగతి కనిపించిందని, ఇది ఒక మంచి పరిణామం అని డిప్యూటి సిఎం భట్టి విక్రమా ర్క మల్లు అన్నారు. సోమవారం సచివాలయంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటి సమావేశం జరగగా కమిటి సభ్యు లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మార్చి మాసంలో సిఎస్టి, వ్యాట్ ఓవరాల్ గ్రోత్ రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పె ట్టుకోగా సుమారు రూ.500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరిందన్నారు. భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటి సిఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉం టే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించా రు. అపార్ట్ మెంట్లు, ఫ్లాట్ల విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికి వ్యవసాయ భూము లు, ఓపెన్ ఫ్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వే గం కనిపించడం లేదు విశ్లేషించి తగిన చర్య లు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. రవాణా శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఎఎన్పిఆర్) వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని, పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది.
గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటిల ద్వారానే ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటి లో సభ్యులుగా చేర్చాలని, గిరిజన సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పకడ్బందీగా అమలు చేసి అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలని రెవెన్యూ అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. నిర్మాణం అనుమతుల విషయంలో హెచ్ఎండిఎ వేగం పెంచాలని మంత్రుల బృందం సూచించింది. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, సిసిఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి , డిప్యూటి సిఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.