Monday, June 2, 2025

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హర్దోయ్:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (మే 31) హర్దోయ్‌ జిల్లాలోని మజ్హిలా పోలీస్ స్టేషన్ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సర్కిల్ ఆఫీసర్ (సిఓ) షహాబాద్ అనుజ్ కుమార్ మాట్లాడుతూ.. “వివాహ ఊరేగింపు నుండి తిరిగి వస్తుండగా, మజ్హిలా పోలీస్ స్టేషన్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోకి బోల్తా కొట్టింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 6 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అనుజ్ కుమార్ తెలిపారు.

ఈ విషాదకరమైన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సిఎం యోగి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News