- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిపై రాకేశ్ జైస్వాల్పై దాడి చేసిన కేసులో బిజెపి కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. దాడి చేసిన కేసులో ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ 132, 352 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్, తమ అధికారులపై దాడి జరిగితే సహించబోమని అన్నారు. అధికారులను పిలిచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్పై కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ పోలీసులు కమిషనర్కు వివరించారు.
- Advertisement -