Friday, August 15, 2025

మధుసూధనా చారి, బాల్క సుమన్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎంపి బాల్కసుమన్‌తో సహ పలువురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ మీడియా చానల్‌పై దాడి చేశారంటూ బిఆర్‌ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తెలంగాణ భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారని మధుసూధనాచారి, బాల్కసుమన్‌తో సహా మరికొందరిపై బంజారా హిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News