రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని
రిసార్ట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో అనుమతి
లేకుండా విదేశీ మద్యంతో విందు ఎస్ఒటి,
చేవెళ్ల పోలీసుల దాడుల్లో దొరికిన మద్యం
మంగ్లీతోపాటు మరో నలుగురిపై కేసు అతిథుల్లో
ఒకరు గంజాయి సేవించినట్లు నిర్ధారణ
మన తెలంగాణ/చేవెళ్ల రూరల్ : రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో గాయని మం గ్లీ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్ఓటి పోలీసులు, చేవెళ్ల పోలీసులతో కలిసి దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమ తి లేకుండా పార్టీ ఏర్పాటు చేయడంతో పా టు పలవురు మద్యం సేవించినట్లు గుర్తించా రు. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో ఆమె కు టుంబ సభ్యులు, సన్నిహితులు 22 మంది పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిలో 10 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా ఒకరు గంజాయి సేవించినట్లు తేలిందని తెలిపారు. ఈ సందర్భంగా మంగ్లీతోపా టు
ఆమె మేనేజర్ దున్నె మేఘరాజ్, అతని స్నేహితుడు దామోదర్రెడ్డి (గంజాయి సేవించిన వ్యక్తి), రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ పార్టీలో 6 ఖాళీ మ ద్యం సీసాలతో పాటు 4 పుల్ బాటిళ్ల మద్యం లభ్యమయ్యాయని తెలిపారు. ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని, విదేశీ మద్యం బాటిళ్లు తీసుకొచ్చారన్న ప్రచారంలో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి సేవించిన వ్యక్తి దామోదర్ కూడా ఈ పార్టీలో తీసుకోలేదని, అంతకుముందు గంజాయి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పార్టీలో సౌండ్ అండ్ పొల్యూషన్, ఎక్సైజ్ పర్మిషన్, ఈవెంట్ పర్మిషన్ లేవని పోలీసులు తెలిపారు.