- Advertisement -
మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్పై కేసు నమోదయింది. సిఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేరంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెటిఆర్ మీడియా ఎదుట రేవంత్ రెడ్డి పరువు ప్రతిష్టలు తీసేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కెటిఆర్పై బిఎన్ఎస్ 353(2), 352 సెక్షన్ల కింద తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్థిరపరిచేలా కెటిఆర్ వ్యవహారం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ పోలీసులకు లిఖితపూర్వత ఫిర్యాదు అందచేశారు.
- Advertisement -