Friday, August 15, 2025

బిజెపి నేత నాయిని న‌రోత్తం రెడ్డిపై క్రిమినల్ కేసు…

- Advertisement -
- Advertisement -

Case registered on Naini narotham reddy

 

హైదరాబాద్: బిజెపి నేత నాయిని న‌రోత్తం రెడ్డిపై పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. మీడియా ముసుగులో త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నార‌ని ఫిర్యాదుతో పాటు లీజు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చైన్నై యాజ‌మాన్యం కేసు పెట్టింది.  సిబ్బందికి జీతాలు ఇవ్వ‌కుండా బిల్డింగ్ ను కబ్జా పెట్టార‌ని ఫిర్యాదు చేశారు. అడిగితే చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని జుబ్లిహిల్స్ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. నరోత్తమ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News