Friday, June 6, 2025

2027 మార్చి 1 నుండి జన గణన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. 2027 మార్చి 1 నుండి జన గణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని బుధవారం (జూన్ 4) ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాలపై జరిగిన క్యాబినెట్ కమిటీ జన గణన నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం.. సామాజిక విలువలు, ప్రయోజనాల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జన గణనతో పాటు కులగణన కూడా జరగనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News