Monday, June 2, 2025

పాక్‌తో ఘర్షణలో మన జెట్‌లు కూలాయి

- Advertisement -
- Advertisement -

సింగపూర్ : పాకిస్తాన్ తో ఈ మధ్య జరిగిన ఘర్షణల్లో విమానాలు నష్టపోయామని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. అయితే ఆరు భారతీయ జెట్ లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసుకొంటున్న ప్రచారాన్ని తో సిపుచ్చారు. అది తప్పుడు ప్రచారం అని ఆ యన అన్నారు. సింగపూర్ లో బ్లూమ్ బెర్గ్ టీ వీకి ఆర్మీచీఫ్ ఓ ఇంటర్ వ్యూ ఇచ్చారు. యు ద్ధంలో విమానాలు ఎందుకు కోల్పోయిందన్న ది తెలుసుకోవడం చాలా ముఖ్యం అని. దీనివల్ల భారత సైన్యం మరింత పకడ్బందీగా వ్యూహాలను మెరుగుపరచుకుని, తిరిగి దాడి చేసేందుకు వీలవుతుందని చౌహాన్ అన్నారు. పాకిస్తాన్ తో జరిగిన ఘర్షణలో భారతదేశం జెట్ లను కోల్పోయిందా అన్న ప్రశ్నకు సమాధానం

ఇస్తూ జెట్ ను కూల్చివేయడం ము ఖ్యం కాదని, వాటిని ఎలా కూల్చారు. ఎందు కు కూల్చారన్నది ముఖ్యమని జనరల్ చౌహాన్ అన్నారు. భారత సైన్యం తాము చేసిన వ్యూ హాత్మక తప్పులను అర్థంచేసుకోగలిగిందని, సరిదిద్దుకున్నామని, రెండు రోజుల తర్వాత మళ్లీ దాన్ని అమలు చేసి , మన జెట్ లు అన్నీ సుదూర లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా వె నక్కి వచ్చేలా చేయగలిగామని జనరల్ తెలిపా రు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆరు భారత జెట్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదన పూర్తిగా తప్పు అని జనరల్ పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News