Saturday, May 31, 2025

కారుపై గీతలు పడ్డాయని ప్రాణం తీశారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో గొడవ జరగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గండ్ర నాగిరెడ్డి (48) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి గత 13 సంవత్సరాల నుంచి కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సూరి కామాక్షి అనే మహిళ ఇంటికి అల్లుడు కృష్ణ కారులో వెళ్లాడు. అదే సమయంలో నాగిరెడ్డి కృష్ణ కారు పక్కన తన కారును ఆపాడు.

పార్కింగ్‌లో ఉన్న కారును కృష్ణ బయటకు తీస్తుండగా కారుపై గీతలు కనిపించాయి. పక్కన నాగిరెడ్డి కారు ఉండడంతో వాచ్‌మెన్‌తో ఫోన్ చేయించి కిందకు రప్పించారు. అనంతరం నాగిరెడ్డిపై కృష్ణ దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చెవిలొంచి రక్తం, నోటి నుంచి నురగ వచ్చిందని, అతడు చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి కామాక్షి, కృష్ణ పారిపోయారు. నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళనకు దిగడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సొంత గ్రామానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News