మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమ్మ.(Chandi Durgamma) ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారు మంచి దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. డైరెక్టర్ మైను ఖాన్. ఎండీ. మాట్లాడుతూ “సౌందర్య అమ్మోరు, విజయశాంతి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్ (Dark theme) లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో చండీ దుర్గమ్మ చిత్రాన్ని రూపొందిస్తున్నాం”అని తెలిపారు. నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ – అమ్మవారి నేపథ్యంతో ఒక మంచి కథతో చండీ దుర్గమా సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ వైఎస్ కృష్ణ, కో ప్రొడ్యూసర్ ఒలి తదితరులు పాల్గొన్నారు.