- Advertisement -
అమరావతి: మనకు అభివృద్ధి కావాలని, పేదరికం పోవాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. వైకుంఠపాళి ఆటలు మన రాష్ట్రానికి వద్దని అన్నారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లకు సాయం చేసేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని, పెద్దాపురం నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. పింఛను పేరుతో (name pension) ఎండల్లో తిప్పి వృద్ధుల మరణానికి కారణమయ్యారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ లేకున్నా ఇంటికెళ్లి మరీ పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. మీ రాష్ట్రంలో భూతం ఉందని, మళ్లీ రాదని గ్యారెంటీ ఏంటని తనను అడుగుతున్నారని చంద్రబాబు తెలిపారు.
- Advertisement -