హైదరాబాద్: ఒక రోజు ముందే పేదల సేవ కార్యక్రమం నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మాది పేదల కోసం పని చేసే ప్రభుత్వమని, పేదలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 64 లక్షల మందికి ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, ఇప్పటికే 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని, కొందరికి పనిచేసే చోటే పెన్షన్లు అందిస్తున్నామని, ఉద్యోగుల తరహాలోనే పేదలకు పెన్షన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పెన్షన్లు పెంచుతామన్న మాట నిలబెట్టుకున్నామని, పెన్షన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చుచేశామని, ఏ రాష్ట్రంలోనూ ఇంతలా పెన్షన్లు ఇవ్వడం లేదని తెలియజేశారు. 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని చంద్రబాబు నాయుడు సూచించారు.
3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -