- Advertisement -
అమరావతి: కక్షతోనే తుని రైలు ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని మాజీ ఎంపి హర్షకుమార్ మండిపడుతున్నారు.
కాపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు కక్ష పెట్టుకున్నారని ప్రశ్నించారు. మంగళవారం హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం కూడా కేసును కొట్టేసిందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాపులను కాపాడతారా? అని అడిగారు. ఒక్కో సామాజిక వర్గాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని, దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ ధ్వజమెత్తారు.
- Advertisement -